
జనరల్

తమిళ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డీసీ’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వామికా గబ్బీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలైన ట్రైలర్ను బట్టి చూస్తే ‘డీసీ’ ఒక శక్తివంతమైన రివెంజ్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. "తప్పు చేస్తే దండించడానికి పోలీసులు వస్తారు.. కానీ ఆ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడుగుతారయ్యా?" అనే డైలాగ్ ట్రైలర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. న్యాయం, ప్రతీకారం, పోలీసుల బాధ్యత వంటి అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. యాక్షన్, భావోద్వేగాలు, బలమైన కథతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!