

మాస్ మహారాజా రవితేజ నటించిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ఘన విజయాన్ని సాధించింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13 న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ షోలతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ను ఘనంగా నిర్వహించారు.
సక్సెస్ మీట్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ, సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు కిషోర్ తిరుమల ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించామని, ఆ లక్ష్యం పూర్తి స్థాయిలో సాధ్యమైందని అన్నారు. సంగీత దర్శకుడు బీమ్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కు వస్తున్న స్పందన ఆనందంగా ఉందని చెప్పారు. హీరోయిన్లు ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!