

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో హిస్టారికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, షూటింగ్ సమయానికి పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఏ పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను ఈ ఏడాది విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
దసరా సీజన్ టాలీవుడ్లో పెద్ద సినిమాలకు మంచి సమయం కావడంతో, అప్పటికి సినిమా సిద్ధం చేయాలని టీమ్ కష్టపడుతోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, దర్శకుడు హను రాఘవపూడి విజన్పై నమ్మకంతో పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. టెక్నికల్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా రూపొందించేందుకు టీమ్ ప్రయత్నిస్తోంది.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జూలై లేదా ఆగస్టు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా టాలీవుడ్లోకి పరిచయం అవుతోంది. మొత్తంగా చూస్తే, ఈ చిత్రంతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!