

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, హీరో ఎంట్రీ సీక్వెన్స్ కోసం చిత్రబృందం ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రారంభ ఘట్టాన్ని అభిమానులు ఎన్నో రోజులు గుర్తుంచుకునేలా డిజైన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొత్త లుక్లో కనిపించనున్నారని, ఆయన పాత్ర పరిచయాన్ని మరింత పవర్ఫుల్గా చూపించేందుకు భారీ యాక్షన్ ఎపిసోడ్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో దాదాపు నలభై మంది ఫైటర్లతో పోరాట ఘట్టాలు చిత్రీకరించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ షెడ్యూల్ పూర్తైన వెంటనే ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సినిమాల్లో కనిపించిన డార్క్ విజువల్ టోన్కు భిన్నంగా, ఈసారి రంగుల హంగులతో నిండిన కొత్త విజువల్ స్టైల్ను ప్రేక్షకులకు చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫ్రేమ్స్ మరింత వైవిధ్యంగా, కథకు తగ్గట్టుగా రూపొందిస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనగా, ప్రతి అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!