

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. అయ్యప్ప భక్తిగీతానికి జీవీ ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజికల్ టచ్ ఇవ్వగా, డప్పు శ్రీను గాత్రం, రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్, పాటలతో ఇప్పటికే సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రీ-రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ ‘ఇరుముడి’ ఒక మంచి ఎమోషనల్ రైడ్ అని, సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయని, ఆగస్టు 21న థియేటర్లలో ఒక డిఫరెంట్ రవితేజను చూస్తారని అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ఇది లైట్హార్టెడ్ సినిమా కాదని, తీవ్రమైన భావోద్వేగాలు, ఉత్కంఠతో సాగే ఫ్యామిలీ డ్రామా అని తెలిపారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను ఇంటెన్స్ డ్రామాలోకి తీసుకెళ్తాయని చెప్పారు. నిర్మాత వై. రవిశంకర్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్రతో పాటు పలువురు సినీ ప్రముఖులు చిత్రంపై నమ్మకం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!