
క్రీడలు

బాలన్ ది బాయ్ సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించగా, జితు మాధవన్ కథ అందించారు. ఈ నెల 14న కేన్స్ బిజినెస్ వింగ్ మార్ష్ డు ఫిలిం లో ఈ చిత్ర స్క్రీనింగ్ జరగనుంది.

దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ ఈ సినిమా భావోద్వేగాలను హత్తుకునేలా రూపొందించామని తెలిపారు. జీవిత ప్రయాణం, అనుభూతులను ప్రతిబింబించే కథగా ‘బాలన్’ నిలుస్తుందని చెప్పారు. నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేకమైన సినిమా అవుతుందని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!