

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న థియేటర్ రెవెన్యూ షేరింగ్ వివాదంపై అన్నపూర్ణ స్టూడియోస్ కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం అమలులో ఉన్న అద్దె విధానానికి బదులుగా పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో పెద్ది వంటి భారీ సినిమాల విడుదలలు దగ్గరపడుతుండటంతో థియేటర్ల మూసివేత హెచ్చరికలు ఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక ప్రకటనలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. నిర్మాతలు గానీ, ఎగ్జిబిటర్లు గానీ ఎవరి పక్షానా నిలవకుండా తటస్థ వైఖరి అవలంబించిన ఈ సంస్థ, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పరోక్షంగా సూచించింది. అక్కినేని కుటుంబానికి చెందిన ఈ ప్రతిష్టాత్మక సంస్థ ప్రకటన టాలీవుడ్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సానుకూల సంకేతంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!