

హిందూ, సనాతన ధర్మంపై గతంలో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ జరగడంతో ఆమె వివరణ ఇచ్చారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఏ మతాన్ని కించపరచే ఉద్దేశంతో ఎప్పుడూ మాట్లాడనని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని ఆమె స్పష్టం చేశారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, తన ధర్మం, విలువలు, విశ్వాసాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యల అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
గతంలో ఓ సందర్భంలో ‘జై శ్రీరామ్’ అనే నినాదాన్ని ఉపయోగిస్తూ కొందరు హింసకు పాల్పడుతున్నారని అనసూయ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కేవలం మతపరమైన నినాదాలు చేయడం కంటే వ్యక్తుల ప్రవర్తన, వారి పనితీరే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మం పేరుతో జరిగే దాడులను ప్రశ్నించడమే తన ఉద్దేశమని ఆమె తాజాగా స్పష్టం చేశారు.
తాను శ్రీరాముడిని భక్తితో కొలుస్తానని, తన ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని కూడా అనసూయ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి వచ్చిన విమర్శల తర్వాత ఆమె వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!