

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదని, ఇది రామ్ పోతినేని కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు మహేశ్ బాబు పి వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్-ఎమోషనల్ ఎంటర్టైనర్ 2002 నేపథ్యంలో రూపుదిద్దుకుంటూ, ఒక ఫ్యాన్ మరియు అతని అభిమాన హీరో మధ్య ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించనుంది. హై ఎనర్జీ యాక్షన్, రొమాన్స్ మరియు అభిమానుల భావోద్వేగాలతో ఈ చిత్రం ప్రత్యేకమైన సినీ అనుభూతిని అందించనుందని ఆయన తెలిపారు.
ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో మెరవనుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే చార్ట్బస్టర్లుగా మారాయి. రామ్ ఈ చిత్రంలో తన కంఫర్ట్ జోన్ను దాటి పూర్తిగా కొత్తగా కనిపిస్తాడని, దానికి ఆయన అభిమానులే ప్రధాన ప్రేరణ అని దర్శకుడు చెప్పుకొచ్చారు. నవంబర్ 27 న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!