

టాలీవుడ్లో వేగంగా ఎదుగుతున్న దర్శకులలో బుచ్చిబాబు ఒకరు. 2021లో విడుదలైన ఉప్పెన సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. తొలి సినిమాతోనే బుచ్చిబాబు తన ప్రతిభను నిరూపించుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఉప్పెన విజయానంతరం బుచ్చిబాబు తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పెద్ది చిత్రాన్ని తెరకెక్కించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. పెద్ది విజయంతో బుచ్చిబాబు డిమాండ్ మరింత పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు లేదా జూనియర్ ఎన్టీఆర్లలో ఒకరితో చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోల కోసం ఇప్పటికే కథలను సిద్ధం చేసుకున్నారని, వారిలో ఒకరితో సినిమా ప్రారంభమైన తర్వాతే మరో ప్రాజెక్ట్పై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!