

'పెద్ది'తో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్తో మరో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం స్టైలిష్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని, సుకుమార్ మార్క్ స్క్రీన్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం.
అలాగే దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో ఓ బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతం అందించనున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. 2028 సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే 'రంగస్థలం'తో బ్లాక్బస్టర్ అందించిన రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!