

చాలా సినిమాలు రిలీజ్ అయిన వెంటనే మేకర్స్ హిట్ అంటూ పోస్టర్లు విడుదల చేస్తారు. అభిమానులు కూడా మా హీరో హిట్ కొట్టేశాడు అని హడావిడి చేస్తారు. కానీ కొద్దిరోజులకు నిజమైన ఫలితం బయటపడుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ ఎదురైనట్లు అనిపిస్తుంది.
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ వంటి బ్లాక్బస్టర్లతో టాలీవుడ్లో క్రేజీ హీరోగా నిలిచిన విజయ్, తరువాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. నటనలో లోపం లేకపోయినా కథల బలహీనత వల్ల వరుసగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది మే చివరలో విడుదలైన కింగ్డమ్ సినిమా మొదట హిట్ టాక్ తెచ్చుకున్నా, రెండో రోజు నుంచి యావరేజ్ టాక్కే పరిమితమైంది. విడుదల రోజు రష్మిక మందన్నా కూడా విజయ్ హిట్ కొట్టేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
₹130 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించారు. తొలి భాగంలో కొంత కథ చూపించినా, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సీక్వెల్ ప్రాజెక్ట్ను ఇప్పుడు పక్కన పెట్టారని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో రౌడీ జనార్ధన్ సినిమా, అలాగే రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు కింగ్డమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ అనే చిన్న సినిమాను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది మొదలవ్వాల్సిన కింగ్డమ్ 2 ప్రాజెక్ట్ ఆర్థిక కారణాల వల్ల రద్దయిందని చెబుతున్నారు. ఇందులో నిజమేంటనేది కొన్ని నెలలు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (1)
విజయ్ దేవరకొండ మరోసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని నమ్మకం ఉంది