

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చర్చకు కారణమైన విషయం ఏదైనా ఉందంటే, అది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి వార్తలే. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని గత ఏడాది గుసగుసలు వినిపించాయి. కానీ ఈ విషయాలపై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. మీడియాలో మాత్రం పెళ్లి తేదీ నుంచి ఏర్పాట్ల వరకు అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి.
వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం గీత గోవిందం. ఆ సినిమా సమయంలోనే స్నేహం ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల బ్యాక్గ్రౌండ్ ఒకేలా ఉండటం, ఎయిర్పోర్ట్లు, రెస్టారెంట్లలో కలిసి కనిపించడం వంటి కారణాలతో ఈ వార్తలకు బలం చేకూరింది. గత ఏడాది అక్టోబర్లో సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయినప్పటికీ కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు ఎవరూ స్పందించలేదు.
ఇప్పుడు పెళ్లి ఈ నెల (ఫిబ్రవరి) 26 న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అనంతరం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్గా మారింది. ఇది పెళ్లి ఆహ్వానం కోసం అయ్యుండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదే నిజమైతే తొలి ఆహ్వానం అందుకున్న ప్రముఖుడు సీఎం రేవంత్ రెడ్డే అవుతారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!