

టీమ్ ఇండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరియు నటి-స్పోర్ట్స్ ప్రజెంటర్ సాహిబా బాలీ మధ్య డేటింగ్ పుకార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇద్దరూ కలిసి కేఫీలో కాఫీ తాగుతున్న వీడియో క్లిప్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు సాహిబాను 'సుందర్ గర్ల్ఫ్రెండ్'గా పిలవడం మొదలుపెట్టారు. అయితే, ఇద్దరూ ఈ పుకార్లపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. సుందర్ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్గా ఉంచుకోవడానికి ఇష్టపడతాడని, సాహిబా కూడా రొమాంటిక్ హింట్లు ఇవ్వకుండా మౌనం పాటిస్తోందని సమీప వర్గాలు తెలిపాయి.
సాహిబా బాలీ ఎంటర్టైన్మెంట్ రంగంలో రైజింగ్ మల్టీ-టాలెంటెడ్ సెలబ్రిటీ. 1994 డిసెంబర్ 5న కాశ్మీరీ కుటుంబంలో జన్మించిన ఆమె, ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదివి, థియేటర్-వీధి నాటకాల్లో చురుకుగా పాల్గొన్నారు. మార్కెటింగ్ రంగంలో అనుభవం సంపాదించిన తర్వాత, సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 IPL ప్రసార బృందంలో చేరడంతో పాపులారిటీ పెరిగి, 2025 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో క్రికెట్ డిజిటల్ కంటెంట్ యాంకర్గా మెరిసారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో లైఫ్స్టైల్, హాస్యం, కెరీర్ టిప్స్ పోస్ట్లతో లక్షలాది ఫాలోవర్లను చేర్చుకున్నారు.
ప్రస్తుతం సుందర్ అంతర్జాతీయ క్రికెట్ విధుల్లో మునిగి ఉండగా, సాహిబా స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ వృత్తిపరమైన బాధ్యతలపైనే దృష్టి పెట్టి, పుకార్లను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!