

దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ను మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దర్శకుడు యూనివర్స్లోని ప్రతి చిత్రానికీ దర్శకత్వం వహించాల్సిన అవసరం లేదనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. పీవీసీయూ కథలు, పాత్రలు, ప్రపంచాన్ని రూపొందిస్తూ.. ఒక్కో సినిమాను తెరకెక్కించే బాధ్యతలను ఇతర దర్శకులకు అప్పగిస్తున్నారు. దీనివల్ల ఒకేసారి పలు కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో పాటు యూనివర్స్ను వేగంగా విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ‘మహాకాళి’, ‘అధీర’, ‘జాంబీ రెడ్డి 2’ వంటి చిత్రాలు ఈ యూనివర్స్లో భాగంగా చర్చలో ఉన్నాయి.
‘మహాకాళి’లో భూమి శెట్టి టైటిల్ పాత్రలో నటిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ షో రన్నర్గా వ్యవహరిస్తున్నారు. ‘అధీర’లో కళ్యాణ్ దాసరి సూపర్ హీరోగా, ఎస్.జే. సూర్య విలన్గా కనిపించనుండగా.. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జాంబీ రెడ్డి 2’కు సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, తేజా సజ్జా మరోసారి హీరోగా నటించనున్నారు. షనాయ కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే ‘జై హనుమాన్’కు మాత్రం ప్రశాంత్ వర్మ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!