
జనరల్

మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే ఆరోపణలతో 23 ఏళ్ల ఐటీ ఉద్యోగి షేక్ అమ్నహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ సుమారు రూ.1 లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో అమిర్, రాహీల్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, మధు అనే వినియోగదారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టడంతో పాటు డ్రగ్స్ సరఫరా నెట్వర్క్పై మరింత సమాచారం సేకరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!