

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ది రాజా సాబ్. యాక్షన్ సినిమాలతో గుర్తింపు పొందిన ప్రభాస్, ఈ చిత్రంతో మళ్లీ తన వింటేజ్ స్టైల్లో కనిపించబోతున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పారితోషికం, సినిమా బడ్జెట్, ఇతర నటీనటుల రెమ్యునరేషన్ విషయాలు ఆసక్తిగా మారాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సత్య, యోగి బాబు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తం బడ్జెట్ సుమారు 450 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ప్రభాస్ సుమారు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి తర్వాత ఆయన రెమ్యునరేషన్ పెరిగినా, ఆదిపురుష్ తర్వాత దాన్ని తగ్గించారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ తన పారితోషికాన్ని తగ్గించారని కూడా టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఇక దర్శకుడు మారుతికి సుమారు 18 కోట్లు, సంజయ్ దత్కు 6 కోట్లు, బొమన్ ఇరానీకి 2 కోట్లు, మాళవిక మోహనన్కు 2 కోట్లు, రిద్ధి కుమార్కు 3 కోట్లు, నిధి అగర్వాల్కు 1.5 కోట్లు అందినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇవి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!