

టాలీవుడ్లో మరో భారీ కాంబినేషన్కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందనున్న సరికొత్త ప్రాజెక్ట్ను ఈరోజు (సోమవారం) అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టైటిల్తో పాటు ప్రాజెక్ట్పై ఇప్పటివరకు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇదిలా ఉండగా, నిర్మాత నాగవంశీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో “నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఈరోజే” అంటూ చేసిన పోస్ట్తో అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచారు. దీంతో ఈరోజే సినిమా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఘన విజయాన్ని అందుకోవడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం టాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!