
సినిమాలు

విజయ్ దేవరకొండ హీరోగా, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ చిత్రం చివరి దశ పనుల్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. కీలక యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక సెట్లు నిర్మిస్తున్నారని, ఈ భాగాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించేందుకు చిత్ర బృందం కృషి చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. యాక్షన్, భావోద్వేగాలు, బలమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!