

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆదివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, కల్వకుంట్ల కుటుంబం ప్రాజెక్టును రాజకీయంగా ఉపయోగించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం, మంత్రులు మ్యాప్లతో సహా పూర్తి వివరాలు ఇచ్చినా బీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ను నీటి నిల్వ లేని చోట ఎందుకు నిర్మించారో ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్ల సూచనలు పాటించలేదని విమర్శించారు. ఎన్డీఎస్ఏ నివేదికను పక్కన పెట్టి హరీశ్ రావు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. తొమ్మిదేళ్లలో చేయలేని పనిని మూడు నెలల్లో చేస్తానని చెప్పడం అవాస్తవమని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!