

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆయన తన సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీజీ20 లీగ్ ఫైనల్కు బ్రాండ్ అంబాసిడర్గా హాజరైన ఆయన మరోసారి తన మానవత్వాన్ని ప్రదర్శించారు.
మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన ఓ అభిమాని విజయ్ను చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను మంచి క్రికెటర్నని, కానీ సరైన ప్రోత్సాహం లేక అవకాశాలు కోల్పోతున్నానని చెప్పి సహాయం కోరాడు. వెంటనే స్పందించిన విజయ్ అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఓదార్చారు. అనంతరం అతని కుటుంబ వివరాలు తెలుసుకుని, తనవంతు సహాయం చేస్తానని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!