
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మియాపూర్లో ప్రతిపాదిత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) భవన నిర్మాణానికి కేటాయించిన భూమిపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రూ.161 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఈ భవనానికి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అయితే భవనానికి కేటాయించిన భూమిపై యాజమాన్య హక్కుల వివాదం నెలకొనడంతో హైకోర్టు తాత్కాలికంగా స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ స్థలం కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!