
జనరల్

యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల తన చిన్ననాటి కష్టాల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. తాము దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని, కుటుంబాన్ని పోషించేందుకు తన తండ్రి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చేదని తెలిపారు. ప్రతి రూపాయి విలువ తెలిసిన ఆ రోజులు తనలో విజయంపై మరింత పట్టుదలను పెంచాయని చెప్పారు.
అదే పట్టుదలతో సినీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1 నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. కుటుంబ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై తీసుకుని, కష్టాలను విజయంగా మలిచిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!