
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరో రోజు కీలక అంశాలతో కొనసాగనుంది. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, సుప్రీంకోర్టు సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ రెండు బిల్లులపై సభలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు విద్యార్థులపై జరిగిన దాడి అంశంపై రాజ్యసభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ఈ మేరకు అధికారిక నోటీసు సమర్పించారు. దీంతో నేటి పార్లమెంట్ సమావేశాల్లో శాసన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!