

కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ హీరోగా ఉండటం, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం వల్ల ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త, స్టైలిష్ లుక్లో ఆయన కనిపించనున్నారని టాక్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25 న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
డ్రాగన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ టోవినో థామస్, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. మొదట ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని భావించినా, చివరకు ఒకే భాగంగా తెరకెక్కిస్తున్నట్లు ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది.
యాక్షన్ సీక్వెన్స్ల విషయంలో ప్రశాంత్ నీల్ ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు చేయని స్టంట్స్, సాహసాలు చేస్తారని సమాచారం. నాలుగు ప్రత్యేక సర్ప్రైజ్లు ప్లాన్ చేశారని, సిక్స్ ప్యాక్ లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్, పోర్ట్లో జరిగే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని టాక్. ఇవన్నీ నిజమా కాదా అనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!