

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా మూవీస్ తో దూసుకపోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సుమారు సగం పూర్తైనట్లు సమాచారం. సమ్మర్లో ఆ ప్రాజెక్ట్ను ముగించి, చిన్న బ్రేక్ తర్వాత లోకేష్తో సినిమా ప్రారంభించాలనే ప్లాన్లో ఉన్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. #AA23గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇంకా సెట్స్పైకి రాకముందే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాపై తాజాగా హీరోయిన్ ఎంపికకు సంబంధించిన వార్తలు టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ‘స్త్రీ 2’ తో భారీ విజయం సాధించిన శ్రద్ధా, పాన్ ఇండియా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు అల్లు అర్జున్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేయబోతున్నారనే వార్త నిజమైతే, హిందీ, తెలుగు, తమిళ మార్కెట్లలో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ఇంకా అధికారిక ప్రకటన కాదని, ఇన్సైడర్ రిపోర్టుల ఆధారంగా ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.
కథ విషయానికి వస్తే, లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తున్నారనే టాక్ ఉంది. సూపర్ పవర్స్ టచ్తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని, అల్లు అర్జున్ ప్రత్యేకమైన లుక్లో కనిపించనున్నారని సమాచారం. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నారని ప్రచారం జరుగుతుండగా, నిర్మాణ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటున్నాయి. అధికారిక కన్ఫర్మేషన్ వస్తే, ఈ ప్రాజెక్ట్ నార్త్ మరియు సౌత్ మార్కెట్లను ఒకేసారి షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!