
సినిమాలు

తన పర్యటనపై చెలరేగిన వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. తాను వైసీపీ నాయకులు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లలేదని, జనసేన మాజీ నాయకుడు దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకే హాజరయ్యానని స్పష్టం చేశారు. అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని తెలిపారు.
గతంలో జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వంటి నాయకులు కూడా వైసీపీ నాయకులు నిర్వహించిన సంతాప సభలకు వెళ్లి ఆ పార్టీ నేతలతో మాట్లాడారని గుర్తుచేశారు. వారిని ఎవరూ వివరణ అడగలేదని, తన విషయంలోనే ఎందుకు వివాదాలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. సరైన సమయంలో ఈ అంశంపై పూర్తి వివరణ ఇస్తానని పేర్కొంటూ, భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులంతా ఏకమవుతారని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!