

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాల్లోనే అత్యంత తీవ్రమైన కార్చిచ్చును ఎదుర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిన మంటలు ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని దహనం చేశాయి. పరిస్థితి అదుపు తప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 4,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ గార్డ్ బృందాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే బలమైన గాలులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు మంటలు వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయి.
మంటలు స్పోకేన్ పరిసర నివాస ప్రాంతాలకు చేరుకోవడంతో దాదాపు 4,000 భవనాలు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సుమారు 2.3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో 60,000 మంది వినియోగదారులు చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రులు, నీటి శుద్ధి కేంద్రాలు వంటి కీలక సేవలు కూడా ప్రభావితమవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!