

ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చెల్లించాల్సి వస్తే ఇప్పటికే తక్కువగా ఉన్న తమ లాభాలపై మరింత భారం పడుతుందని దేశవ్యాప్తంగా పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులపై అదనపు వ్యయం తమ వ్యాపార నిర్వహణపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు.
ఇంధన రిటైలర్లకు ఎండీఆర్ నుంచి మినహాయింపు ఇవ్వకపోతే రూ.2,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులను స్వీకరించడం నిలిపివేసి నగదు లావాదేవీలకే పరిమితం కావాల్సి వస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ ప్రతినిధి మాంటీ సెహగల్ తెలిపారు. ఇదే అంశంపై అఖిల కర్ణాటక పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు లేఖ రాసింది. పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను డీలర్లు తమ ఇష్టానుసారం పెంచుకునే అవకాశం ఉండదని, అందువల్ల డిజిటల్ చెల్లింపుల వ్యయాన్ని భరించడం కష్టమవుతుందని వారు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!