
గాసిప్స్

మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా ఆర్థిక పనితీరుపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను కలుపుకుని కంపెనీ కన్సాలిడేటెడ్ నష్టం రూ.10,858.83 కోట్ల నుంచి రూ.22,238.23 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.78,635.61 కోట్ల నుంచి రూ.71,869.94 కోట్లకు తగ్గింది.
2025 జూన్లో జరిగిన ఏఐ171 విమాన ప్రమాదం అనంతరం అదనపు భద్రతా తనిఖీలు, తాత్కాలికంగా విమాన సర్వీసుల తగ్గింపు వంటి చర్యలు చేపట్టాల్సి వచ్చింది. దీనికి తోడు భౌగోళిక రాజకీయ పరిణామాలు, గగనతల మూసివేతలు, నిర్వహణకు సంబంధించిన సవాళ్లు కూడా కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపాయి. FY2025-26లో మొత్తం ఖర్చులు రూ.93,733.31 కోట్లకు చేరగా, విదేశీ మారకద్రవ్య నష్టాలు కూడా గణనీయంగా పెరిగి రూ.7,388.23 కోట్లుగా నమోదయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!