

అమెరికా మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ హెచ్1బీ వీసాలు, భారతీయులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమెరికాలో ఉద్యోగాలను భారతీయులు ఆక్రమిస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రపంచవ్యాప్తంగా “వీసా కార్టెల్” నడుస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉద్దేశిస్తూ “వీసాల దేవాలయం” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. హెచ్1బీ, ఎల్, ఎఫ్1, ఓపీటీ వీసాల వ్యవస్థ అమెరికన్ ఉద్యోగులపై ప్రభావం చూపుతోందని ఆయన ఆరోపించారు.
భారతీయ విద్యార్థులు, టెక్ ఉద్యోగులపై కూడా ష్మిట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారని, వారు చదువు తర్వాత హెచ్1బీ ద్వారా ఉద్యోగాలు, గ్రీన్ కార్డులు పొందుతున్నారని అన్నారు. పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్లకు అవకాశాలు తగ్గిస్తున్నాయని ఆయన విమర్శించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై భారతీయులు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!