
రాజకీయాలు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ థియేటర్లలో మంచి ఆదరణ పొందిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో ఉచితంగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. దీంతో ఓటీటీ సభ్యత్వం లేకపోయినా ఎవరైనా సులభంగా ఈ సినిమాను వీక్షించే అవకాశం లభిస్తోంది.
అవా ఎంటర్టైన్మెంట్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, డాక్టర్ మోహన్ బాబు నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా సినిమాను ఆస్వాదిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!