
జనరల్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడిలను అదనపు న్యాయమూర్తులుగా నియమించినట్లు న్యాయశాఖ ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించింది.

ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయపరమైన వ్యవహారాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముగ్గురు న్యాయాధికారులు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!