

వ్యవసాయ కనెక్షన్లు మినహా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు ఆమోదం లభించింది. ఈ పథకం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, విద్యుత్ నష్టాలను తగ్గించడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నిర్ణయం కొత్తది కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర విద్యుత్ శాఖతో త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయని, వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం ఉండదని స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు బిగించబోమని మరోసారి హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!