
సినిమాలు

నరసరావుపేటలో నిర్వహించిన రుణమేళా (క్రెడిట్ అవుట్రీచ్) కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. ప్రజల వద్దకే బ్యాంకింగ్ సేవలు చేరాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని ఆమె తెలిపారు. వీధి వ్యాపారులు, మహిళలు, చిన్న వ్యాపారులకు ప్రభుత్వ హామీతో తక్కువ వడ్డీకి రుణాలు అందించి స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని, అర్హత ఆధారంగా రుణాలు అందించడం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆమె చెప్పారు. నరసరావుపేటలో జరిగిన ఈ రుణమేళా కార్యక్రమమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!