
రాజకీయాలు

హైదరాబాద్లో ప్రతి ఏడాది జరిగే బత్తిని సోదరుల ఫిష్ ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ అగర్వాల్ సమాజ్ సహకారం అందించనుంది. సమాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర గోయల్ మాట్లాడుతూ.. మృగశిర కార్తె సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో తమ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొంటారని తెలిపారు. శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్థమా నివారణ కోసం వేలాది మంది ఈ ఫిష్ ప్రసాదాన్ని తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
జూన్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉదయం 8:30 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 32 నుంచి 34 ప్రత్యేక కౌంటర్లు, 40కు పైగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తోందన్నారు. ఫిష్ ఫింగర్లింగ్స్ను ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో అందించగా, వెటర్నరీ వైద్యులు మరియు నిపుణులు పర్యవేక్షణ చేపడతారని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!