
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ప్రముఖ గాయని స్మిత తన కొత్త సంగీత ప్రాజెక్ట్ ‘తత్వమసి’ గురించి వివరాలు వెల్లడించారు. సమాజంలో మరుగున పడిపోయిన తత్వ గీతాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు తెలిపారు. భక్తి, అద్వైతం, వైరాగ్యం, సామాజిక చైతన్యం వంటి అంశాలను ప్రతిబింబించే గీతాలు ఇందులో భాగమవుతాయని ఆమె పేర్కొన్నారు.
ఈరోజు అధికారికంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లో భాగంగా రాబోయే 100 శనివారాల పాటు ప్రతి వారం ఒక కొత్త తత్వ గీతాన్ని విడుదల చేయనున్నట్లు స్మిత వెల్లడించారు. తొలి గీతంగా విడుదలైన ‘మానస సంచరరే’ పాటకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. తత్వ గీతాల అసలు భావాన్ని యువతకు సులభంగా చేరవేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!