
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్ వివాదంపై దిల్లీలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో నిరసనలు మరింత ఉధృతమవుతూ, తక్షణ చర్యలు తీసుకోవాలని, పారదర్శక దర్యాప్తు చేపట్టాలని ఆందోళనకారులు కోరుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!