

ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజియన్పై రష్యా మరోసారి భారీ డ్రోన్ మరియు క్షిపణి దాడులకు పాల్పడింది. ఆదివారం ఉదయం బిలా సెర్క్వా నగరంపై జరిగిన ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ, రష్యా సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ దాడిలో రష్యా అత్యాధునిక హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్’ను ఉపయోగించిందని పేర్కొన్నారు. గంటకు సుమారు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి అణు వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ యుద్ధంలో రష్యా ఈ క్షిపణిని ఉపయోగించడం ఇది మూడోసారి అని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!