
జనరల్

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఎల్లుండిలోపు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేయాలని, అర్హులైన ప్రతి ఓటరికి 100 శాతం ఫారాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పూర్తయిన ఫారాల డిజిటలైజేషన్ను వెంటనే ప్రారంభించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), సూపర్వైజర్లకు మరోసారి శిక్షణ నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సీఈవో స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!