
జనరల్

తెలంగాణ రాష్ట్రంలో అడవుల్లో కార్చిచ్చుల ఘటనలు తీవ్రంగా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో దేశంలో అటవీ అగ్నిప్రమాదాల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 44,247 ఘటనలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మే వరకు 14,915 అగ్నిప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిలో 14,021 మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఎక్కువ ఘటనలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అటవీశాఖ నివేదిక తెలిపింది.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఒడిశా 84,605 ఘటనలతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో సగటున ఏడాదికి 14,749 అగ్నిప్రమాదాలు నమోదవుతున్నాయి. కాళేశ్వరం, భద్రాద్రి, కవాల్ ప్రాంతాల్లో ఎక్కువ ఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీ అగ్నిప్రమాదాల నివారణకు నిధులు తక్కువగా ఉండటంతో నియంత్రణ చర్యలు సవాలుగా మారుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!