

నల్సార్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకించిన విద్యార్థుల వివాదం కీలక మలుపు తిరిగింది. విద్యార్థుల చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా పేర్కొన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నల్సార్ 2026 బ్యాచ్ లా గ్రాడ్యుయేట్ల అడ్వకేట్ ఎన్రోల్మెంట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నల్సార్ నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిల్స్కు సూచించింది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని నల్సార్ వీసీని BCI ఆదేశించింది. క్యాంపస్ రాజకీయాలు, అధ్యాపకుల పాత్రపైనా విచారణ చేయాలని సూచించింది. ఆగస్టు 19న నివేదికను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, సీజేఐ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమంటూ విద్యార్థులు గత నెల 23న వీసీ, రిజిస్ట్రార్కు లేఖ రాశారు. రాజ్యాంగ విలువలు, పౌర హక్కుల విషయంలో సీజేఐ వైఖరిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!