

స్మార్ట్ఫోన్ను గంటల తరబడి ఉపయోగించడం వల్ల ఎదురైన అనారోగ్య సమస్యపై సీనియర్ నటి షకీలా కీలక విషయాలను వెల్లడించారు. మంచంపై తప్పుడు భంగిమలో పడుకుని ఎక్కువసేపు ఫోన్లో రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటం అలవాటుగా మారిందని ఆమె తెలిపారు. ఈ అలవాటు కారణంగా మెడలోని నరాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి, సమస్య తీవ్రమైందని చెప్పారు. చివరకు అత్యవసరంగా మెడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఈ సర్జరీకి సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు షకీలా తెలిపారు. ప్రస్తుతం మంచం దిగడం, ఆహారం తీసుకోవడం వంటి సాధారణ పనులకు కూడా ఇతరుల సహాయం అవసరమవుతోందని చెప్పారు. తన అనుభవం నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలను ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లకు అతిగా అలవాటు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!