

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఢిల్లీలో కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలో అమలు అవుతున్న గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రెయిన్స్, నీటి తొట్టెల నిర్మాణం వంటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సామాజిక తనిఖీల పారదర్శకతను కేంద్ర మంత్రి ప్రశంసించారు.
మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని తన నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. అలాగే జూలై 1న విబి జీ రాంజీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని పవన్ కళ్యాణ్ కోరారు. 2006లో అనంతపురం నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అభ్యర్థనకు కేంద్ర మంత్రి అంగీకరించి కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!