
జనరల్

పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న వార్షిక మహానాడు వేడుకల సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్తో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మే నెలలో జరిగే మహానాడు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు అమితోత్సాహంతో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మహానాడు విజయవంతంగా సాగాలని, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!