
జనరల్

మహారాష్ట్ర, కర్ణాటక ఘాట్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ప్రస్తుతం సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. జలాశయపు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా, ఇప్పటికే 44.69 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది.
ఇదే విధంగా వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే, తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నీటితో నిండే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం సాగు నీటి అవసరాలను తీర్చడంలో కీలకంగా మారనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!