
గాసిప్స్

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న హెచ్పీసీఎల్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోవడంతో సుమారు 3,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నదిలో కొట్టుకుపోయాయి. అనంతరం వాటిలో కొన్ని నది ఒడ్డుకు చేరగా, స్థానికులు వాటిని తీసుకెళ్తున్న దృశ్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గ్యాస్ లీకేజీ లేదా పేలుడు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, తరలించవద్దని రాయగఢ్ జిల్లా కలెక్టర్ ప్రజలను హెచ్చరించారు. ఎక్కడైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని, భద్రతా సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుంటారని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!