
జనరల్

జనసేన కార్యకర్తలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఇంకా అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని కమిటీ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యకర్తల ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వనని స్పష్టం చేశారు.
గౌరవం లేని చోట ఇబ్బందులు రాకుండా చూస్తానని, తాను త్రికరణ శుద్ధితో మద్దతు ఇస్తానని చెప్పారు. కార్యకర్తల నుంచి కూడా అదే చిత్తశుద్ధిని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విభేదిస్తానని, కానీ అవసరమైతే కూర్చొని చర్చించుకుంటామని తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు జనసేన సొంతంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ఏపీ శ్రేయస్సు కోసం అలా చేయలేదని చెప్పారు. రాష్ట్ర సుస్థిరత కోసం తాను తీసుకున్న నిర్ణయం కీలకమని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!