
జనరల్

ధనుష్ అభిమానుల సంక్షేమ సంఘం అధికారిక జెండా ఆవిష్కరణతో తమిళనాడులో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఎరుపు, తెలుపు రంగులతో రూపొందించిన జెండాలో ధనుష్ నమస్కార భంగిమలో కనిపించడం, రాజకీయ పార్టీ జెండాను పోలి ఉండే డిజైన్ కావడంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశంపై ఆసక్తిగా చర్చిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖులకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ధనుష్ భవిష్యత్తుపై అనేక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ధనుష్ పేరు కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రచారాలపై ధనుష్ లేదా ఆయన పీఆర్ బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!