
టెక్నాలజీ

జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. జూలై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా ఈ సిరీస్ జరగనుంది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఎంపిక కాగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే వంటి అనుభవజ్ఞులతో పాటు వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించారు.
ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శివమ్ దూబేను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వరుస అంతర్జాతీయ సిరీస్లకు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఈ మార్పు కీలకంగా మారనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!